ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌

ABN , First Publish Date - 2020-12-04T05:41:26+05:30 IST

తెలుగు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ గురువారం ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌
ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆకాశ్‌

సీలేరు, డిసెంబరు 3 : తెలుగు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ గురువారం ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. లంబసింగి నుంచి సీలేరు వరకు ఎత్తైన కొండలు, కోనలు, జలపాతాలు వంటి సహజసిద్ద అందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతాలు అనుకూలమైనవన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సినీ నటుడిగా రాణించగలమని నాన్నగారి సూచనల మేరకే వచ్చానన్నారు. ఆకాష్‌ వెంట నర్సీపట్నం వైసీపీ శాసనసభ్యుడు ఉమాశంకర్‌ గణేష్‌ తల్లి, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

 

Updated Date - 2020-12-04T05:41:26+05:30 IST