బొబ్బిలిలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-04-19T04:43:40+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొబ్బిలిలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ బొబ్బిలి మండల కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్‌ చేశారు.

బొబ్బిలిలో క్వారంటైన్‌ సెంటర్లు   ఏర్పాటు చేయండి

సీతానగరం(బొబ్బిలి), ఏప్రిల్‌ 18:  కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొబ్బిలిలో   క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ బొబ్బిలి మండల కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్‌ చేశారు. ఆది వారం కామ్రేడ్‌ గంటి ప్రసాద్‌ స్మారక భవనంలో నిర్వహించిన విలేఖర్ల సమా వేశంలో ఆయన మా ట్లాడారు. కరోనా రెండో దశ తీవ్రత ప్రమాదరకంగా మారిన తరుణంలో వెంటనే   పట్టణంలో ఉన్న విద్యా సంస్థలను  మూసివేయాలన్నారు. వైద్య ఎమర్జెన్సీ ప్రకటించి బొబ్బిలిలో ఐసోలేషన్‌లో వార్డు హాస్పిటల్స్‌, బెడ్ల సంఖ్య పెంచాలని, వెంటిలేటర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సిబ్బందిని పెంచి, మందులు అందుబాటులో ఉంచాలని, వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకుండా చూడాలని  తెలి పారు. పారిశుధ్యంపై  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  




Updated Date - 2021-04-19T04:43:40+05:30 IST