జమున హేచరీస్కు నోటీసులపై రఘునందన్రావు స్పందన
ABN , First Publish Date - 2021-11-08T21:09:42+05:30 IST
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.
మెదక్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు. వేధించే ఉద్దేశంతో చేస్తే సీఎం కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెప్తారని రఘునందన్రావు పేర్కొన్నారు.