ఇకపై టెస్ట్‌లు సులభతరం

ABN , First Publish Date - 2020-07-16T10:37:47+05:30 IST

కొవిడ్‌ టెస్టులను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవిని బస్సు ఎంతగానో ..

ఇకపై టెస్ట్‌లు సులభతరం

రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌


రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 15: కొవిడ్‌ టెస్టులను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవిని బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఆనం కళాకేంద్రం వద్ద బుధవారం ఆయన సబ్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో కలిసి  బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ అర గంట సమయంలోనే ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎన్వీవీ సత్యనారాయణ, మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్‌ రమేష్‌కిశోర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోమల, ఎంహెచ్‌వో వినూత్న, ఆర్టీసీ ఆర్‌ఎం నాగేశ్వరరావు, డీఏ సత్యనారాయణమూర్తి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీభరత్‌రామ్‌ కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Updated Date - 2020-07-16T10:37:47+05:30 IST