రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

ABN , First Publish Date - 2021-03-02T06:38:33+05:30 IST

వేములవాడ రాజరాజే శ్వరస్వామివారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది.

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
భక్తులతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణం


30 వేల మందికిపైగా భక్తుల రాక

వేములవాడ,మార్చి 1:వేములవాడ రాజరాజే శ్వరస్వామివారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు  స్వామివారిని దర్శించుకొని తరించారు. భక్తజనంతో ధర్మదర్శనం, ప్రత్యేకదర్శనం, కోడెమొక్కుల క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనం, కోడెమొక్కుల చెల్లింపునకు భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది.  భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి నిలువెత్తు బెల్లం సమర్పించుకున్నారు.  సోమవారం 30 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు, ఆలయ ఖజానాకు రూ.20లక్షల పైచిలుకు ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-02T06:38:33+05:30 IST