నైట్ కర్ఫ్యూ ఎత్తివేత... రాత్రి కూడా తెరుచుకోనున్న దుకాణాలు

ABN , First Publish Date - 2021-01-19T14:00:47+05:30 IST

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాజస్థాన్...

నైట్ కర్ఫ్యూ ఎత్తివేత... రాత్రి కూడా తెరుచుకోనున్న దుకాణాలు

జైపూర్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాజస్థాన్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్... సాయంత్రం ఏడు గంటల తరువాత మార్కెట్ మూసివేయాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఆర్టీ-పీసీఆర్ టెస్టుల రుసుమును రూ. 800 నుంచి రూ. 500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు ఇంతవరకూ విధించిన నిబంధనలను కొంతమేరకూ సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2021-01-19T14:00:47+05:30 IST