లాక్డౌన్ విధించే సమయం ఆసన్నమైంది : రాజేశ్ తోపే
ABN , First Publish Date - 2021-04-11T21:30:38+05:30 IST
మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే
ముంబై : మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే లాక్డౌన్ విధించడానికి ప్రస్తుతం సుముఖంగా లేమన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వెంటిలేటర్ల కొరత లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు వారాల పాటు లాక్డౌన్ విధించి కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అలా లేదన్నారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్తో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.