విశ్వహిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో ర్యాలీ
ABN , First Publish Date - 2021-10-26T03:31:58+05:30 IST
బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా సోమవారం మండలంలోని ఈస్గాం నుంచి విశ్వహిందూ సమ్మేళన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాగజ్నగర్ రాజీవ్చౌక్, లారీచౌరస్తా, బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.
కాగజ్నగర్ టౌన్, అక్టోబరు 25: బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా సోమవారం మండలంలోని ఈస్గాం నుంచి విశ్వహిందూ సమ్మేళన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాగజ్నగర్ రాజీవ్చౌక్, లారీచౌరస్తా, బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేష్, కాళీదాస్ మజుందార్, రణబీర్ పాల్గొన్నారు.