2024 కల్లా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తాం : వీహెచ్‌పీ

ABN , First Publish Date - 2021-04-11T01:55:54+05:30 IST

ముందుగానే ప్రకటించిన విధంగా 2024 నాటి కల్లా రామమందిర నిర్మాణాన్ని పూర్తిచేసి తీరుతామని విశ్వహిందూ

2024 కల్లా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తాం : వీహెచ్‌పీ

లక్నో : ముందుగానే ప్రకటించిన విధంగా 2024 నాటి కల్లా రామమందిర నిర్మాణాన్ని పూర్తిచేసి తీరుతామని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్పష్టం చేశారు. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్‌వాపీ మసీదును సర్వే చేయాలని పురావస్తు శాఖను కోర్టు ఆదేశించడంపై ప్రశ్నించగా.. తాము కేవలం రామ మందిర నిర్మాణంపైనే దృష్టి సారించామని, అదే తమకు ముఖ్యమని, దానిని పూర్తి చేసిన తర్వాతే ఇతర అంశాలపై దృష్టిసారిస్తామని తేల్చి చెప్పారు. అప్పటి వరకూ ఇతర సమస్యలపై దృష్టి సారించమని అలోక్ కుమార్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-11T01:55:54+05:30 IST