ముద్రగడ ఉద్యమంనుంచి తప్పుకుంటాననడం బాధిస్తోంది: ఆకుల రామకృష్ణ
ABN , First Publish Date - 2020-07-16T10:39:31+05:30 IST
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుంచి తప్పుకుంటాననడం బాధిస్తోందని కాపు ..
రావులపాలెం రూరల్, జూలై 15: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుంచి తప్పుకుంటాననడం బాధిస్తోందని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. బుధవారం గోపాలపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ జాతికోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో నందం వీరవెంకటసత్యనారాయణ, సాధనాల శ్రీనివాస్, సాధనాల సత్యనారాయణ, ఆకుల భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.