రామాంతపూర్లో మీడియా ప్రతినిధుల నిరసన
ABN , First Publish Date - 2020-12-04T14:34:25+05:30 IST
రామాంతపూర్ డీఆర్సీ సెంటర్ వద్ద మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు.
హైదరాబాద్: రామాంతపూర్ డీఆర్సీ సెంటర్ వద్ద మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు. మీడియా పాయింట్ ఏర్పాటు చేయలేదని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని ధర్నా చేపట్టారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పందుకు యత్నిస్తున్నారు. మీడియా పాయింట్ ఏర్పాటు చేయకపోవడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.