జీవీఎంసీకి అరుదైన గుర్తింపు

ABN , First Publish Date - 2020-08-11T09:54:39+05:30 IST

స్మార్ట్‌సిటీ మిషన్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచిన జీవీఎంసీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకోబోతున్నది.

జీవీఎంసీకి అరుదైన గుర్తింపు

15న సోలార్‌ ప్రాజెక్టుపై నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌లో ప్రసారం


విశాఖపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌సిటీ మిషన్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచిన జీవీఎంసీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకోబోతున్నది. ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సోలార్‌ ప్యానల్స్‌(సోలార్‌ ఫ్లోటింగ్‌) దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. వినూత్నమైన ఈ ప్రాజెక్టుపై నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌  ఈ నెల 15న సాయంత్రం ఆరు గంటకు ప్రత్యేక ప్రసారం చేయనున్నట్టు జీఎంఎంసీ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఎస్‌ఈ వినయ్‌కుమార్‌ తెలిపారు. ఇది జీవీఎంసీకి ఒక విధంగా అరుదైన గుర్తింపుగానే భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T09:54:39+05:30 IST