ఎమ్మెల్యే చిట్టెం వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో

ABN , First Publish Date - 2021-10-25T04:30:22+05:30 IST

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఛత్రపతి శివాజీపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో హిందూ సంఘా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఎమ్మెల్యే చిట్టెం వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
రాస్తారోకోను ఉద్దేశించి మాట్లాడుతున్న అయ్యప్ప

మరికల్‌, ఆక్టోబరు 24 : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఛత్రపతి శివాజీపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో హిందూ సంఘా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయవాది అయ్యప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ రాజయ్య ముందు ఇక్కడ ఛత్రపతి శివాజీ ఫొటో ఎందుకు ఉంది. ఆయన ఎవరు ఇక్కడ ఫొటో పెట్టాల్సిన అవసరం ఏ ముంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐ నాసర్‌ వారి సమస్యలను ఉన్నతాఽ దికారులకు తెలియజే స్తానని చెప్పడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో రమేష్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, వెంకటేష్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:30:22+05:30 IST