రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-18T06:01:15+05:30 IST
జాతీయ రహదారిపై ఉంగుటూరు మండల పరిధిలో ఆదివారం సాయంత్రం 280 బస్తాలతో వెళుతున్న అక్రమ రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నట్టు ఉంగుటూరు పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ ఏలూరి శేఖర్ బాబు సోమవారం వివరించారు.
ఉంగుటూరు, మే 17: జాతీయ రహదారిపై ఉంగుటూరు మండల పరిధిలో ఆదివారం సాయంత్రం 280 బస్తాలతో వెళుతున్న అక్రమ రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నట్టు ఉంగుటూరు పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ ఏలూరి శేఖర్ బాబు సోమవారం వివరించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన లారీలో కాకినాడకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్టు కనుగొన్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని బియ్యం విలువ రూ.2,52,000లుగా గుర్తించామని ఈ బియ్యాన్ని భీమడోలు మండలం పాతూరులోని మండల స్టాక్ పాయింట్లో భద్రపరిచి లారీని చేబ్రోలు పోలీసు స్టేషన్కు స్వాధీనం చేసి ఫిర్యాదు చేసినట్లు సీఎస్డీటీ శేఖర్ బాబు వివరించారు.