భూముల రీసర్వేను పరిశీలించిన ఆర్డీఓ
ABN , First Publish Date - 2021-07-30T06:18:20+05:30 IST
మండలంలోని రామరాజుపల్లిలో చేపట్టిన భూ రీసర్వేను గురువారం అనంతపురం ఆర్డీఓ మధుసూదన పరిశీలించారు.
పామిడి, జూలై 29 : మండలంలోని రామరాజుపల్లిలో చేపట్టిన భూ రీసర్వేను గురువారం అనంతపురం ఆర్డీఓ మధుసూదన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు పొలాలను ఆయన సందర్శించారు. రీ సర్వేపై త హసీల్దార్ ఆర్వీ సునీతాబాయితో ఆరా తీశారు. త్వరితగతిన రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కా ర్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి గా సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్వేయర్ బ్రహ్మానందం, ఆర్ఐ లత, వీఆర్వో జయచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.