ఆర్డీవో సమక్షంలో అధికారులపై వైసీపీ నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2020-07-17T11:16:26+05:30 IST
అధికారం ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలకు పనులు జరగడం లేదం టూ వైసీపీ నాయకులు రెవె న్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మర్రిపూడి, జూలై 16 : అధికారం ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలకు పనులు జరగడం లేదం టూ వైసీపీ నాయకులు రెవె న్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కం దుకూరు ఆర్డీవో ఓబులేసు సమక్షంలోనే వైసీపీ నాయకులు అధికారులను నిలదీశారు. అధికారు ల నిర్వాకం వల్ల పలు గ్రామాలలో భూతగాదాలు తలెత్తుతున్నాయని, గ్రామ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. చిమట గ్రామంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ సచివాలయ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం లేదని ఆర్డీవో తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా అధికారుల నిర్ణయాల వల్ల పలు గ్రామాలలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. దీంతో తహసీల్దార్ సువర్ణరావుపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.