ఉత్తమ సేవలతోనే ప్రజల్లో గుర్తింపు
ABN , First Publish Date - 2021-06-12T05:25:46+05:30 IST
ఏ ఉద్యోగికి అయినా ఉత్తమ సేవలతోనే ప్రజల్లో శాశ్వతమైన గుర్తింపు లభిస్తుందని డాక్టర్ సృజన అన్నారు.
నందలూరు, జూన్11 : ఏ ఉద్యోగికి అయినా ఉత్తమ సేవలతోనే ప్రజల్లో శాశ్వతమైన గుర్తింపు లభిస్తుందని డాక్టర్ సృజన అన్నారు. స్థానిక ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డి ఇం దుకో ఉదాహరణ అన్నారు. 2020 మార్చి నెల లో మొదటి సారిగా వి జృంభించిన కరోనా వైర్సను కట్టడి చేయడంలో ఎస్ఐ పాత్రఅద్వితీయమని సృజన పేర్కొన్నారు. శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో బదిలీపై వెళ్లిన ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డిని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ పిల్లి పిచ్చయ్య ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డి కరోనాను కట్టడికి శక్తివంచనలేకుండా కృషి చేయడంతో పాటు చాలా మందికి భోజనం సమకూర్చారని, కరోనాతో మరణించినవారికి దహనసంస్కారా లు నిర్వహించారన్నారు. అలాగే కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సి బ్బందికి ఎంతో సహకరించాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ శివరామకృష్ణ, వైద్య సిబ్బంది మధుసూదన్రెడ్డి, లక్ష్మయ్య, ఆశాలు పాల్గొన్నారు.