ప్రజా సేవతోనే వలంటీర్లకు గుర్తింపు
ABN , First Publish Date - 2021-05-17T04:51:17+05:30 IST
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే వలంటీర్లకు గుర్తింపు లభిస్తుందని సర్పంచ్లు రామాపురం సర్పంచ్ రాధాకిష్ర్ణారెడ్డి, బ్రాహ్మణపల్లె సర్పంచ్ లక్ష్మీదేవి పేర్కొన్నారు.
గోపవరం, మే 16 : ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే వలంటీర్లకు గుర్తింపు లభిస్తుందని సర్పంచ్లు రామాపురం సర్పంచ్ రాధాకిష్ర్ణారెడ్డి, బ్రాహ్మణపల్లె సర్పంచ్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆదివారం ఆయా పంచాయతీల్లో విశిష్ట సేవలందించిన వలంటీర్లకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో వలంటీర్ల సేవలు ప్రశంసనీయమని, ప్రజలకు, అధికారులకు వారధులుగా ఉంటూ పారదర్శక విధులు అందించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు మోసే, వెంకటసుబ్బయ్య, స్థానిక నేతలు రమణారెడ్డి, శంకర్రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.