రికార్డులు పూర్తిస్థాయిలో స్కానింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T06:11:59+05:30 IST

రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ లక్ష్మీశ సూచించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

రికార్డులు పూర్తిస్థాయిలో స్కానింగ్‌ చేయాలి

ముమ్మిడివరం, జూన్‌ 22: రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ లక్ష్మీశ సూచించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులు స్కానింగ్‌ చేసేటప్పుడు ఎన్ని పేజీలు స్కానింగ్‌ జరుగుతుంది, మెమొరీ ఎంతవరకు ఉంటుందనే విషయాలను పరిశీలించారు.అడంగళ్‌, ఎఫ్‌ఎంబీ, ఆర్‌ఎస్‌ఆర్‌ స్కానింగ్‌ చేసే విషయంలో పేజీలన్నీ క్వాలిటీతో స్కానింగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో వసంతరాయుడు, ఏవో జవ్వాది వెంకటేశ్వరి, తహశీల్దార్‌ ఎస్‌.పోతురాజు, డిప్యూటీ తహశీల్దార్‌ యడ్ల రాంబాబు ఉన్నారు.

Updated Date - 2021-06-23T06:11:59+05:30 IST