సుధా భరద్వాజ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ABN , First Publish Date - 2020-09-25T08:18:16+05:30 IST
బీమా కోరెగావ్ కేసులో నిందితురాలిగా ఉన్న సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: బీమా కోరెగావ్ కేసులో నిందితురాలిగా ఉన్న సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. సుధా భరద్వాజ్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయవాది వ్రిందా గ్రోవర్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీ విచారణకు స్వీకరించారు.