విద్యుత్‌ ఉద్యోగుల రిలే దీక్షలు

ABN , First Publish Date - 2021-02-25T04:09:57+05:30 IST

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం(327) ఆధ్వర్యంలో సర్కిల్‌ కార్యాలయం ఎదుట బుధవారం రిలే దీక్షలు చేపట్టారు.

విద్యుత్‌ ఉద్యోగుల రిలే దీక్షలు
దీక్షల్లో కూర్చున్న విద్యుత్‌ ఉద్యోగులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి24: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం(327) ఆధ్వర్యంలో సర్కిల్‌ కార్యాలయం ఎదుట బుధవారం రిలే   దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సతీష్‌ మాట్లాడుతూ ఆర్టిషన్‌ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్‌ వర్తింపజేయాలని, ఒక సంస్థలో ఒకే సర్వీసు రూల్స్‌ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, రామకృష్ణ, సన్మాన్‌రావు, అశోక్‌, రాములు, రవి, స్వామి, సుధాక్‌, రాంచందర్‌, బుచ్చిబాబు, సతీష్‌, కుమారస్వామి, రాహుల్‌, నజీవ్‌, సుధాకర్‌, కిషన్‌, నరేష్‌, నర్సింగరావు, ప్రవీణ్‌, గోపాల్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T04:09:57+05:30 IST