విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు
ABN , First Publish Date - 2021-02-25T04:09:57+05:30 IST
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం(327) ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే దీక్షలు చేపట్టారు.
ఆసిఫాబాద్ రూరల్, ఫిబ్రవరి24: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం(327) ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ ఆర్టిషన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని, ఒక సంస్థలో ఒకే సర్వీసు రూల్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, రామకృష్ణ, సన్మాన్రావు, అశోక్, రాములు, రవి, స్వామి, సుధాక్, రాంచందర్, బుచ్చిబాబు, సతీష్, కుమారస్వామి, రాహుల్, నజీవ్, సుధాకర్, కిషన్, నరేష్, నర్సింగరావు, ప్రవీణ్, గోపాల్ పాల్గొన్నారు.