డిగ్రీ పరీక్ష ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2020-02-23T06:05:11+05:30 IST
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గతేడాది నవంబరులో జరిగిన
వెంకటాచలం, ఫిబ్రవరి 22 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గతేడాది నవంబరులో జరిగిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శనివారం వీఎ్సయూ అధికారులు విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ డ్యూవ్ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో 9,667 మంది విద్యార్థులకుగాను 5232 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 39.51శాతం, బాలికల ఉత్తీర్ణతా శాతం 69.98 శాతమని అధికారులు తెలిపారు. ఫలితాలను వీఎ్సయూ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చన్నారు. రీవాల్యూయేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు 15రోజులలోపు కళాశాలల ప్రిన్సిపాల్ను సంప్రదించి, అప్లికేషన్లను ఇవ్వాలని వీఎ్సయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సాయిప్రసాద్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు.