కొండ చిలువను అడవిలో వదిలిన రెస్క్యూ టీం
ABN , First Publish Date - 2021-06-13T05:46:07+05:30 IST
మహానంది సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ పక్కన వున్న చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువను అటవీ శాఖ రెస్క్యూ టీం కాపాడి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు.
మహానంది, జూన్ 12: మహానంది సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ పక్కన వున్న చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువను అటవీ శాఖ రెస్క్యూ టీం కాపాడి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు. శనివారం తెలుగుగంగ కాలువ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువ కనిపించింది. ఈ విషయాన్ని అటవీశాఖ రెస్క్యూ టీం సభ్యులు భాస్కర్, షేక్ ఇమామ్కు తెలిపారు. వెంటనే వారు ఆ ప్రదేశానికి చేరుకొని కొండచిలువను సంచిలో బంధించి సమీపంలోని నల్లమలలో వదిలారు.