రైతుల ఆందోళనకు ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల సంఘీభావం
ABN , First Publish Date - 2020-12-05T05:32:29+05:30 IST
ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ఆర్ఎఫ్సీఎల్ కార్మికులు సంఘీభావం ప్రకటించారు.
కోల్సిటీ, డిసెంబరు 4: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ఆర్ఎఫ్సీఎల్ కార్మికులు సంఘీభావం ప్రకటించారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శుక్రవా రం ఫ్యాక్టరీ గేటు ముందునుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళననుద్దేశించి ఇప్టూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్, ఆర్ఎఫ్సీఎల్ శాఖ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడారు. మోదీ ప్రభు త్వం రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చిందని, దీ నిని నిరసిస్తూ ఢిల్లీలో రైతులు వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. వారికి కార్మికవర్గం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాల ని, బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఇప్టూ నేతలు మల్యాల దుర్గయ్య, రాజేశ్వ ర్, సత్యనారాయణ, మొగిలి, పాష పాల్గొన్నారు.