నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2021-06-14T06:04:51+05:30 IST

తీర ప్రాంతంలోని నగరం ఆర్‌ఎం డ్రెయిన్‌లో అధికారపార్టీ నాయకులు ఎలాంటి అనుమతులులేకుండా వందలాది ట్రక్కుల మట్టిని పొక్లెయిన్‌ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు
నగరం ఆర్‌ఎం డ్రెయిన్‌లో అక్రమంగా ప్రొక్లెయినర్‌ద్వారా మట్టి తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

రేపల్లె, జూన్‌ 13: తీర ప్రాంతంలోని నగరం ఆర్‌ఎం డ్రెయిన్‌లో అధికారపార్టీ నాయకులు ఎలాంటి అనుమతులులేకుండా వందలాది ట్రక్కుల మట్టిని పొక్లెయిన్‌ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారు. నగరంలో పేదలకు నివేశన స్థలాల కింద 2.5 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా మెరకలు చేసేందుకు సుమారు రూ.18లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు ఉపాధి హామీ కూలీల ద్వారా మట్టి తవ్వకాలు జరిపి మెరకలు చేయాలని నిబఽంధన ఉంది. అధికారపార్టీ నాయకులు మాత్రం ఈదుపల్లి, నగరం సమీపంలో ఆర్‌ఎం డ్రెయిన్లో  మట్టి తవ్వకాలు జరిపి ఆ ప్లాట్లలో మెరక చేస్తున్నారు. గత రెండు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా అదికారులు మాత్రం అటువైపు కన్నెత్తైనా చూడడం లేదు. మట్టి తవ్వకాలపై ఇన్‌చార్జి డ్రెయినేజీ డీఈ మహబూబ్‌ బాషాను వివరణ కోరగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారని, నిలుపుదల చేసేందుకు సిబ్బందిని పంపామని తెలిపారు.  


Updated Date - 2021-06-14T06:04:51+05:30 IST