టాటా ఏస్ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-06-24T04:56:15+05:30 IST
రోడ్డు ప్రమాదంలో సచివాలయ వీఏఏ మృతిచెందాడు.
పాలకొల్లు రూరల్, జూన్ 23 : రోడ్డు ప్రమాదంలో సచివాలయ వీఏఏ మృతిచెందాడు. ఎస్ఐ కె.శ్రీని వాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దిగమర్రుకు చెం దిన గార్లంక సూర్యతేజ (26) బాడవ గ్రామంలో వ్యవ సాయ అసిస్టెంట్గా సచివాలయంలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళు తుండగా పెదమామిడిపల్లిలోని మోడరన్ రైస్ మిల్లు వద్ద చించినాడ వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనం రాంగ్రూట్లో వచ్చి అతివేగంగా ఽఢీకొట్టి ంది.దీంతో రోడ్డుపై పడిన సూర్య తేజ తలకు బలమైన గాయమై అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుడు రవి తేజకు తల్లి లక్ష్మి, భార్య పద్మావతి, రెండు వారాల పాప ఉన్నారు. మృతుడి పినతండ్రి రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.