వెదిరలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-05-11T06:03:46+05:30 IST

రామడుగు మండలం వెదిర శివారులోని గణేశ్‌ నగర్‌ ప్రాంతంలో సోమ వారం రాత్రి కరీంనగర్‌- జగిత్యాల ప్రధాన రహ దారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న సంఘటనలో ఒక రు మృతిచెందగా మరొక రు తీవ్రంగా గాయప డ్డారు.

వెదిరలో రోడ్డు ప్రమాదం
క్షతగాత్రుడిని బయటకు లాగుతున్న స్థానికుడు

 ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం  

 ఆసుపత్రికి తరలింపు


రామడుగు, మే 10: రామడుగు మండలం వెదిర శివారులోని గణేశ్‌ నగర్‌ ప్రాంతంలో సోమ వారం రాత్రి కరీంనగర్‌- జగిత్యాల ప్రధాన రహ దారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న సంఘటనలో ఒక రు మృతిచెందగా మరొక రు తీవ్రంగా గాయప డ్డారు. పోలీసుల కథనం ప్రకారం గంగాధర మం డలం కురిక్యాలకు చెంది న కనికుట్ల రాజేశం (55), శ్రీనివాస్‌ (25) ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా జగిత్యాల వైపు నుంచి కరీంనగర్‌ వెళ్తున్న వరిధాన్యం తరలించే లారీ గణేశ్‌నగర్‌ శివారులో ఢీకొట్టింది. దీంతో రాజేశం ఎగిరి లారీ టైర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక  ఎస్సై వివేక్‌ అక్కడికి చేరు కుని గాయపడిన శ్రీనివాస్‌ను అంబులెన్స్‌లో కరీంనగర్‌ హాస్పిటల్‌కు తరలిం చారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా మారడంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. సంఘటనా స్థలాన్ని రూరల్‌ ఏసీపీ విజయ సారధి సందర్శించి పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివేక్‌ వివరించారు. 

Updated Date - 2021-05-11T06:03:46+05:30 IST