అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. సీఐ దంపతులు మృతి
ABN , First Publish Date - 2021-05-08T12:04:56+05:30 IST
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...
- రంగారెడ్డిలో ఆగివున్న లారీని ఢీకొన్న కారు
- దంపతులు మృతి
హైదరాబాద్/రంగారెడ్డి: నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సుల్తాన్ బజార్కి చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, భార్య ఝాన్సీగా పోలీసులు గుర్తించారు.