అద్దంకిలో పూర్తిస్థాయిలో ఆక్రమణల తొలగింపు
ABN , First Publish Date - 2021-06-20T06:14:44+05:30 IST
అద్దంకి పట్టణంలో పూ ర్తి స్థాయిలో ఆ క్రమణల తొలగింపు చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మార్కింగ్ బారెడు... తొలగింపు మూరెడు’ కథనం ప్రచురితం కావటంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక వచ్చింది. పట్టణంలోని నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు(మెయిన్రోడ్డు)లో శనివారం సా యంత్రం ఎక్స్కవేటర్తో ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. మార్కింగ్ ఇచ్చిన వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి కథనంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక
మార్కింగ్ ఇచ్చిన వరకు తొలగిస్తామన్న కమిషనర్
అద్దంకి, జూన్ 19: అద్దంకి పట్టణంలో పూ ర్తి స్థాయిలో ఆ క్రమణల తొలగింపు చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మార్కింగ్ బారెడు... తొలగింపు మూరెడు’ కథనం ప్రచురితం కావటంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక వచ్చింది. పట్టణంలోని నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు(మెయిన్రోడ్డు)లో శనివారం సా యంత్రం ఎక్స్కవేటర్తో ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. మార్కింగ్ ఇచ్చిన వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆక్రమణల తొలగింపు ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్ ఫజులుల్లా అక్కడకు చేరుకొని ప్రభుత్వ స్థలం ఉన్న వరకు ఆక్రమణలు తొలగిస్తామని తేల్చిచెప్పారు. మార్కింగ్ ఇచ్చిన వరకు ఆక్రమణల తొలగింపు చేస్తుండటంతో సుమారు 66 అడుగుల మేర రోడ్డు విశాలంగా మారనుం ది. ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించి సెం టర్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. టీపీవో వెంకటేశ్వరరెడ్డి, టీపీఎస్ నారాయణరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.