రహదారి పనులను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-01-29T06:34:00+05:30 IST
రహదారి పనులు పూర్తి చేయాలని మండలంలోని శెట్టిపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహిం చారు.
వేములపల్లి, జనవరి 28: రహదారి పనులు పూర్తి చేయాలని మండలంలోని శెట్టిపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహిం చారు. ఆందోళనతో సుమారు గంటపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ బీమారం-సూర్యాపేట రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అద్దంకి- నార్కట్పల్లి రహదారి క్రాస్రోడ్డు నుంచి శెట్టిపాలెం గ్రామశివారు వరకు చేపడుతున్న పనులు ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దుమ్ము, దూళితో పిల్లలు, వృద్ధులు కళ్లు, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో ఆసుపత్రులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యను ఆర్అండ్బీ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చూస్తామని నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.