కాలువల నుంచి రోడ్లపైకి మురుగు

ABN , First Publish Date - 2021-05-18T05:59:49+05:30 IST

కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని ఎస్సీపాలెంలో ఆర్సీ కాంపౌండ్‌లో కాలువలు నిండిపోయియి.

కాలువల నుంచి రోడ్లపైకి మురుగు
ఆర్సీఎం కాంపౌండ్‌లో రోడ్డుపైకి వచ్చిన మురికి నీరు


కంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పెరిగిన దోమలు, ఈగలు

పట్టించుకోని అధికారులు

కంభం, మే 17 : కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని ఎస్సీపాలెంలో ఆర్సీ కాంపౌండ్‌లో కాలువలు నిండిపోయియి. మురు గు నీరంతా రోడ్లపైకి రావడంతో వాహన, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటి కంపును భరించలేకపోతున్నారు. కాలువలను శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పాలెంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఓవైపు కరోనాతో ప్రజలంతా ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ తరుణం లో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాల్సిన అధి కారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోడ్లపైకి చేరిన మురుగు నీటితో దోమలు, ఈగలు ఎక్కువయ్యాయని దీంతో ఏం రోగాలు వస్తాయోనని అందరూ భయపడుతున్నారు. తక్షణ మే అధికారులు మురుగు నీటిని తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-18T05:59:49+05:30 IST