రైతురుణాల కోసం రూ.100 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-03-02T05:55:08+05:30 IST

రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్‌ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే అన్నారు.

రైతురుణాల కోసం రూ.100 కోట్లు మంజూరు
రాందేవ్‌ కాంబ్లేను సన్మానిస్తున్న దృశ్యం

డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే

లక్ష్మణచాంద, మార్చి 1 : రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్‌ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ కాంబ్లే మాట్లాడారు. అతి తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి రమేష్‌, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గంగా రాం, చామన్‌పెల్లి సర్పంచ్‌ పడిగెల గంగాధర్‌, ఉప సర్పంచ్‌ కొమ్మోజి రమణ, రాచాపూర్‌ ఎంపీటీసీ రమాముత్యం, గురాల లింగారెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:55:08+05:30 IST