రైతురుణాల కోసం రూ.100 కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2021-03-02T05:55:08+05:30 IST
రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్ కాంబ్లే అన్నారు.
డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు రాందేవ్ కాంబ్లే
లక్ష్మణచాంద, మార్చి 1 : రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్ కాంబ్లే అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాందేవ్ కాంబ్లే మాట్లాడారు. అతి తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రఘునందన్రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి రమేష్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గంగా రాం, చామన్పెల్లి సర్పంచ్ పడిగెల గంగాధర్, ఉప సర్పంచ్ కొమ్మోజి రమణ, రాచాపూర్ ఎంపీటీసీ రమాముత్యం, గురాల లింగారెడ్డి పాల్గొన్నారు.