వీర జవాన్ కుటుంబానికి రూ.19.5 లక్షల సాయం
ABN , First Publish Date - 2022-07-21T07:16:41+05:30 IST
పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అశువులు బాసిన వీర జవాన్ చీకల ప్రవీణ్కుమార్రెడ్డి కుటుంబానికి ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్టు బాసటగా నిలిచింది.
ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్టు అందజేత
ఐరాల, జూలై 20: పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అశువులు బాసిన వీర జవాన్ చీకల ప్రవీణ్కుమార్రెడ్డి కుటుంబానికి ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్టు బాసటగా నిలిచింది. 2020వ సంవత్సరం నవంబరు 8న కశ్మీరులోని కలర్స్, మచ్చల్ సెక్టార్లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో తలపడిన కమాండో ప్రవీణ్కుమార్రెడ్డి అశువులు బాశారు. ఈయనకు తల్లి సుగుణ, తండ్రి ప్రతా్పరెడ్డి, భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు. వీరి కుటుంబానికి ఎదో ఒకటి చేయాలన్న తలంపుతో తమ ట్రస్టు ద్వారా వారి కుటుంబానికి రూ.19.50 లక్షలను ఐల రాజశేఖర్రెడ్డి అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్కుమార్రెడ్డిని ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారన్నారు. ఆయన కుటుంబానికి ట్రస్టు తరపున ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ చెక్కును చిత్తూరు వెస్టు సీఐ శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ డబ్బుతో పిల్లలను చదివించాలన్నారు.