భారత్ ప్రతిచర్యతో చైనాకు చెమటలు: మోహన్ భగవత్
ABN , First Publish Date - 2020-10-25T17:02:14+05:30 IST
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు ఇతర...
నాగపూర్(మహారాష్ట్ర): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు ఇతర సంఘ్ నేతలు ఈరోజు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మన దేశ సైనికులకున్న దేశభక్తి, దేశ రక్షణ విషయంలో గల అకుంఠిత దీక్ష, దేశాన్ని పాలిస్తున్న నేతలకు ఉన్న స్వాభిమానం ఉన్నతమైనవని అన్నారు. చైనా భారత్లో అతిక్రమణకు పాల్పడుతున్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసన్నారు. చైనా ఇదేవిధంగా తైవాన్, యూఎస్, జపాన్ భారత్లతో గొడవలకు దిగుతున్నదన్నారు. అయితే భారత్ ధీటుగా సమాధానమివ్వడంతో చైనాకు వణుకుపుడుతున్నదన్నారు.