సంస్కరణలను అమలు చేయండి

ABN , First Publish Date - 2021-09-19T05:14:09+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. శాఖాపరమైన సమీక్షల నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చిన ఆ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు శనివారం కృష్ణదాస్‌ను ఆయన మబుగాంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు.

సంస్కరణలను అమలు చేయండి
మొక్కను నాటుతున్న ఐజీ శేషగిరిబాబు

డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌

నరసన్నపేట/పోలాకి, సెప్టెంబరు 18: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. శాఖాపరమైన సమీక్షల నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చిన ఆ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు శనివారం కృష్ణదాస్‌ను మబుగాంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో  కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీ చేసి భవిష్యత్‌లో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఐజీ పలు రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందర్శించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్‌ ఆర్‌.సత్యనారాయణ, నరసన్నపేట సబ్‌ రిజిస్ట్రార్‌ బీఎస్‌ఎన్‌ రమణారావు పాల్గొన్నారు.

  



 

Updated Date - 2021-09-19T05:14:09+05:30 IST