24న డ్రాగన్ఫ్రూట్ సాగుపై శిక్షణ
ABN , First Publish Date - 2021-01-20T05:27:26+05:30 IST
సేంద్రియ వ్యవసాయ విధానంలో డ్రాగన్ప్రూట్(సిరిజెమ్మెడు పండు) సాగుపై వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సేంద్రియ వ్యవసాయ విధానంలో డ్రాగన్ప్రూట్(సిరిజెమ్మెడు పండు) సాగుపై వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పద్మయ్య, గన్నవరం రైతు అన్నే పద్మావతి శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణలో పాల్గొనే రైతులు 0863-2286255, 9705383666కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.