చినముత్తేవి సచివాలయంలో పత్తాలేని సిబ్బంది

ABN , First Publish Date - 2021-04-16T06:56:50+05:30 IST

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవటం, తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు.

చినముత్తేవి సచివాలయంలో  పత్తాలేని సిబ్బంది
కుర్చీలన్నీ ఖాళీగా ...

కూచిపూడి : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవటం, తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. చినముత్తేవి గ్రామ సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులకు గురువారం 12 గంటల సమయంలో నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన వారి గురించి  కార్యదర్శి వరప్రసాద్‌ను అడుగగా, మిగిలిన ఉద్యోగులు ఫీల్డ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సమస్యలపై వచ్చిన అర్జీదారులు ఊసూరుమంటూ వెనుతిరిగారు.

Updated Date - 2021-04-16T06:56:50+05:30 IST