గంగానదికి పవిత్ర హారతి

ABN , First Publish Date - 2021-06-21T05:38:34+05:30 IST

గంగామాత ఆవిర్భవించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గంగానదికి పవిత్ర హారతి
గంగానదికి హారతి ఇస్తున్న స్వరూపానందేంద్ర

పెందుర్తి, జూన్‌ 20: గంగామాత ఆవిర్భవించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శారదా పీఠం పక్షాన గంగమ్మతల్లికి చీరను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు పవిత్ర హారతులిచ్చి ప్రణమిల్లారు. గంగా తీరాన్ని దర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని స్వామిజీ తెలిపారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:38:34+05:30 IST