ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి

ABN , First Publish Date - 2021-01-20T06:53:59+05:30 IST

ఒకరి నిర్లక్ష్యం.. అతి వేగం మరొకరి ప్రాణాలను కబ ళించగా... మరో ఇద్దరిని విషమ పరిస్థితుల్లోకి నెట్టింది. ఏడుగురి ని గాయాలపల్జేసింది.

ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి
మృతిచెందిన హరినాథరెడ్డి

 రెండు బైక్‌లను ఢీకొన్న జీప్‌ ఫ ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం 


తిరుపతి(నేరవిభాగం), జన వరి 19: ఒకరి నిర్లక్ష్యం.. అతి వేగం మరొకరి ప్రాణాలను కబ ళించగా... మరో ఇద్దరిని విషమ పరిస్థితుల్లోకి నెట్టింది. ఏడుగురి ని గాయాలపల్జేసింది. ఈ ఘట న మంగళవారం తిరుపతిలో చోటుచేసుకుంది. ఎం.ఆర్‌.పల్లె ఎస్‌ఐ నరసింహ తెలిపిన ప్రకారం.. చంద్రగిరి దిగువవీధికి చెందిన కె.సిద్దారెడ్డి కుమారుడు హరినాథ్‌రెడ్డి (49) తిరుపతిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. తిరుపతిలో పని ముగించు కున్న ఆయన మంగళవారం సాయంత్రం చంద్రగిరికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. 6 గంటల సమయంలో అలిపిరి-జూ పార్క్‌ మార్గంలో దేవ్‌లోక్‌ సమీపంలో వెళ్తుండగా.. ఇదే సమయంలో చంద్రగిరి వైపునుంచి ఎదురుగా వేగంగా వస్తున్న జీపు (ఏపీ09 ఎక్స్‌7406) హరినాథ్‌రెడ్డి బైకును, ఆ వెనుకే వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో హరినాథ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ద్విచక్రవాహనంలోని భార్యాభర్తల కు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహ నాలను ఢీకొన్న జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంటలో పడిపోవడంతో అందులోని ఏడు గురు యాత్రికులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది రుయాస్పత్రికి తర లించారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం తీవ్రగాయాలపాలైనవారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎం.ఆర్‌.పల్లె ఎస్‌ఐ నరసింహ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళ్తున్న కారును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను జీప్‌ ఢీకొన్నట్టు తెలుస్తోందని ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2021-01-20T06:53:59+05:30 IST