గౌరీ పరమేశ్వరులకు కుంకుమ పూజలు
ABN , First Publish Date - 2020-12-05T03:40:19+05:30 IST
పాతవెంకోజిపాలెం శ్రీ సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమాభిషేకాలను నిర్వహించారు.
వెంకోజిపాలెం, డిసెంబరు 4: పాతవెంకోజిపాలెం శ్రీ సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమాభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సారె మహోత్సవంలో మహిళలు వివిధ రకాల మిఠాయిలు, పండ్లు అమ్మవారికి సమర్పించారు. పండ్లు, కాయలు, మిఠాయిలతో పాటు పసుపు, కుంకుమలను అమ్మవారికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మళ్ల రవికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, డిప్యూటీ మాజీ మేయర్ మళ్ల అప్పలరాజు, వైసీపీ జిల్లా సహాయ కార్యదర్శి పీల వెంకట పరదేశినాయుడు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.