లాక్డౌన్ కాలానికి జీతాలివ్వాలి
ABN , First Publish Date - 2020-05-31T11:28:52+05:30 IST
కరోనా లాక్డౌన్ సమయంలో తాము చేసిన పనికి సంబంధించిన జీతాలు చెల్లించకుండా నేటికీ కాలయాపన
కడప (మారుతీనగర్), మే 30 : కరోనా లాక్డౌన్ సమయంలో తాము చేసిన పనికి సంబంధించిన జీతాలు చెల్లించకుండా నేటికీ కాలయాపన చేయడం బాధాకరమని వెంటనే మాకు రావాల్సిన జీతాలను ఇవ్వాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక కడప డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.