కలకలం రేపిన శిశువు విక్రయం

ABN , First Publish Date - 2020-08-13T06:37:18+05:30 IST

రాజమహేంద్రవరంలో ఒక మహిళకు పుట్టిన శిశువును విక్రయించడంతో అది కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ

కలకలం రేపిన శిశువు విక్రయం

రాజమండ్రి నుంచి కొనుగోలు చేసిన భీమవరం వాసులు

కేసు నమోదు చేసిన పోలీసులు


భీమవరం క్రైం, ఆగస్టు 12: రాజమహేంద్రవరంలో ఒక మహిళకు పుట్టిన శిశువును విక్రయించడంతో అది కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరంలో ఒక మహిళ భీమవరానికి చెందిన ఒక జంటకు ఈనెల మొదటి వారంలో శిశువును విక్రయించింది. వన్‌టౌన్‌ పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆరా తీశారు.


ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే శిశువును విక్రయించామని చెప్పడంతో ఐసీడీఎస్‌ అధికారులు విచారణ చేశారు. దత్తత స్వీకారం లేకుండా శిశువును కొనుగోలు చేయడం నేరమంటూ పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్‌ పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం టూటౌన్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్టు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-08-13T06:37:18+05:30 IST