రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోంది: కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2021-08-16T19:31:10+05:30 IST

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోందని కేంద్ర రసాయానాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా తెలిపారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోంది: కేంద్రమంత్రి

సంగారెడ్డి: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోందని కేంద్ర రసాయానాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా తెలిపారు. సోమవారం కర్నాటక రాష్ట్రం బీదర్ వెళుతూ సదాశివపేటలో ఆగిన కేంద్రమంత్రి బాసవేశ్వరుని విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల  ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిపడా ఎరువులు సరఫరా చేయవచ్చన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విండ్ మరియు సోలార్ పవర్ ఉత్పత్తికి తెలంగాణలో కావాల్సినంత వనరులు ఉన్నాయని కేంద్రమంత్రి భగవంత్ కుభా పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-16T19:31:10+05:30 IST