సంగారెడ్డి: ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస
ABN , First Publish Date - 2021-01-20T19:47:47+05:30 IST
సంగారెడ్డి జిల్లా: ఝరాసంఘం మండలం, బర్ధీపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంఘం మండలం, బర్ధీపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. నిమ్స్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం భూ సేకరణ చేయాలని భావించింది. అయితే దీని కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.