Telangana: తండ్రిని హత్య చేసిన కొడుకులు
ABN , First Publish Date - 2021-09-30T15:38:01+05:30 IST
ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు.
సంగారెడ్డి: ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి తండ్రి పెద్దగొల్ల పాపయ్య కొడుకులు నరేష్, కృష్ణ కలిసి హత్య చేసి పరారయ్యారు. అంతే కాకుండా మరో సోదరుడిని హత్య చేసుకుందుకు నరేష్, కృష్ణ యత్నించారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు విఠల్ జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి నలుగురు కుమారులు విఠల్, కృష్ణ, నరేష్, చిరంజీవి ఉన్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.