పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-07-20T05:46:56+05:30 IST
మండంల లోని అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ
వెల్గటూర్ , జులై 19: మండంల లోని అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలం లోని కోటిలింగాల, ముత్తునూర్, ముక్కట్రావ్పేట, రాంనూర్ గ్రామాలలో అడి షనల్ కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాలలో పారిశుధ్య పనులు, అవెన్యూ ప్లాంటేషన్ను పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా గ్రామాలలో వరదల కారణంగా అపరిశుభ్రత ఏర్పడిందని యుద్ద ప్రాతిప దికన పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యం గా గోదావరి తీర ప్రాంత గ్రామాలలో వరదల కారణంగా అపరిశుభ్రత అధికంగా ఉందని వెంటనే పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అఽధికారి హరికిషన్, డీఎల్పీవో కనకదు ర్గ, ఎంపీడీవో సంజీవ్రావు, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో అనిల్, నక్క రవి తేజ, యాగండ్ల తిరుపతి, అనుమాల తిరుపతి పాల్గొన్నారు.