Chinnamma శపథం
ABN , First Publish Date - 2021-10-18T15:00:40+05:30 IST
ఎన్నో సమస్యలు తనను చుట్టుముట్టిన సందర్భంలోనూ అన్నాడీఎంకేను అందలమెక్కించే వెళ్ళానని, శాసనసభ ఎన్నికలలో తాను పార్టీకి ఎందు కు దూరమయ్యానో అన్నాడీఎంకే నేతలందరికీ తెలుసునని
ఐకమత్యంతో పార్టీని మళ్ళీ గెలిపిద్దాం
చెన్నై: ఎన్నో సమస్యలు తనను చుట్టుముట్టిన సందర్భంలోనూ అన్నాడీఎంకేను అందలమెక్కించే వెళ్ళానని, శాసనసభ ఎన్నికలలో తాను పార్టీకి ఎందు కు దూరమయ్యానో అన్నాడీఎంకే నేతలందరికీ తెలుసునని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అన్నారు. స్థానిక రామాపురంలోని ఎంజీఆర్ నివాసగృహం వద్ద కార్యకర్తలనుద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగిస్తూ అన్నాడీఎంకేని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా వుందని, ప్రజలకోసం అందరూ ఐకమత్యంగా వుండాల్సిన తరుణమి దేనని, అన్నాడీఎంకేని మళ్ళీ అధికారంలోకి తెప్పించేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తన వల్ల అన్నాడీ ఎంకే పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే తలంపుతోనే తాను మౌనం వహించానని, ప్రస్తుతం పార్టీలో ఐకమత్యం అవసరమని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం శ్రద్ధ చూపకపోతే ఎంతటి ఉన్నత పదవులలో ఉన్నా తొలగింపబడతారని అన్నారు. అందరూ ఐక మత్యంగా వుండాలి, అన్నాడీఎంకేని గెలిపించాలంటూ శశికళ శపథం చేశారు.