ఏపీలో 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్

ABN , First Publish Date - 2021-08-10T23:54:46+05:30 IST

ఏపీలో ఈ నెల 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఏపీలో 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్

అమరావతి: ఏపీలో ఈ నెల 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ సమయాల్లోనే స్కూళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. పాఠశాల్లో కొవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోని టీచర్లకు టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఆన్‌లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్లోనే పూర్తి స్థాయిలో స్కూళ్లను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

Updated Date - 2021-08-10T23:54:46+05:30 IST