ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2021-07-29T21:05:37+05:30 IST
ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆగస్ట్ 16 లోపు ఉపాధ్యాయులకు
అమరావతి: ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆగస్ట్ 16 లోపు ఉపాధ్యాయులకు 100 శాతం వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. రెండో విడత విద్యాకానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాడు-నేడు పనులు 90-98 శాతం పూర్తయ్యాయని, ఆగస్ట్ 16న నాడు-నేడు ఫేజ్-2తో.. స్కూళ్ల రూపురేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అమ్మ ఒడి, వసతి దీవెన వద్దనుకుంటున్నవారికి.. వచ్చే ఏడాది నుంచి ల్యాప్టాప్లు అందిస్తామని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.