రాజధానిలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T17:00:56+05:30 IST

పది నెలల నుంచి మూసివేతలో ఉన్న స్కూళ్లు రేపటి...

రాజధానిలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం

న్యూఢిల్లీ: పది నెలల నుంచి మూసివేతలో ఉన్న స్కూళ్లు రేపటి (జనవరి16) నుంచి తెరుచుకోనున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని 10, 12 వ తరగతి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి, 12 వ తరగతులలో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు తెరవనున్నారు. అయితే పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


కాగా విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం పాఠశాలల కోసం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కరోనా లక్షణాలున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను స్కూలు క్యాంపస్‌లోనికి రానివవ్వకూడదు. స్కూలు ఎంట్రీగేటు వద్ద ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఉండాలి. స్కూలు ఎంట్రన్స్, క్లాస్‌రూమ్, ల్యాబ్స్, పబ్లిక్ యుటిలిటీ ప్రాంతాలలో హ్యాండ్ శానిటైజేషన్ ఏర్పాటు చేయాలి. కంటైన్మెంట్ జోన్లకు వెలుపలి స్కూళ్లను మాత్రమే తెరవాలి. అలాగే ఈ ప్రాంతాలకు చెందినవారెవరూ స్కూలు పరిసరాలలోనికి రాకూడదు. స్టాఫ్‌ కూడా ప్రత్యేక టైమ్ టేబుల్ ప్రకారం హాజరుకావాల్సివుంటుంది. తరగతులను కూడా కొద్ది గంటలపాటు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-01-17T17:00:56+05:30 IST